పవన్ కళ్యాణ్ వడ్డిస్తే తిన్నాం...ఎంతో సంతోషంగా అనిపించింది
on Mar 29, 2024
ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ వారం షోకి జానీ మాష్టర్, గణేష్ మాష్టర్ వచ్చారు. మాస్టర్స్ విత్ కంటెస్టెంస్ట్స్ థీమ్ ఇచ్చారు. ఇందులో సాత్విక్ వాళ్ళ మాష్టర్ శివతో కలిసి పవన్ కళ్యాణ్ సాంగ్ "భీమ్లా నాయక్ " కి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్లకు తోడు జూనియర్ పవన్ కళ్యాణ్ పేరుతో ఒక వ్యక్తి అచ్చం రియల్ పవన్ కళ్యాణ్ లా స్టేజి మీదకు వచ్చి అద్భుతంగా స్టెప్స్ వేశారు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఐపోయారు.
ఐతే జూనియర్ పవన్ కళ్యాణ్ పక్కన నిలబడితేనే ఆ వైబ్రేషన్స్ మాములుగా లేవు అలాంటిది నిజంగా పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడితేనా అని హోస్ట్ నందు ఆదిని ఒక ప్రశ్న అడిగాడు. "పవన్ కళ్యాణ్ గారితో మీకు ఉన్న మెమోరీస్ ఏవైనా షేర్ చేసుకోండి" అని అడిగాడు. "బేసిక్ గా ఎవరినైనా ఫస్ట్ టైం చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి కానీ ఒక్క కళ్యాణ్ గారి విషయంలోనే రోజూ గూస్ బంప్స్ వస్తాయి..మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకేంటి ఆది విశేషాలు అని భుజం మీద చెయ్యేసి మళ్ళీ తీసేసారు. అన్నా ఏమనుకోకుండా ఆ చెయ్యి అలాగే ఉంచి మాట్లాడు అన్నా..కళ్యాణ్ గారికి వాళ్ళ అమ్మ గారు చేసే బిర్యాని అంటే చాలా ఇష్టం. భీమ్లా నాయక్ షూటింగ్ టైంలో నేను, త్రివిక్రమ్ గారు, సునీల్ అన్న, కళ్యాణ్ గారు ఉన్నాం. క్యారవాన్ లో కళ్యాణ్ గారు వడ్డిస్తే మేము తిన్నాం..ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు" అని అన్నాడు ఆది. ఇక ప్రణీత జూనియర్ పవన్ కళ్యాణ్ తో స్టేజి మీద "బాపు గారి బొమ్మ" సాంగ్ కి స్టెప్పేసింది. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే ఉండే ఆ క్రేజ్ కి అందరూ ఫిదా ఐపోతుంటారు. ఇక ఈ స్టేజి మీద కంటెస్టెంట్స్ జడ్జెస్ అంతా కూడా కాసేపు ఫన్నీగా క్రికెట్ ఆడి ఎంటర్టైన్ చేశారు.
Also Read